దేశంలో లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి కొన్ని లక్షల మంది రోజువారీ వేతన కార్మికులు, వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. వలస కూలీలు అయితే కూడు, గూడు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఎంతో మంది వలస కూలీలు ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, ఈ వలస కూలీలను ఆదుకోవడానికి ఇటు ప్రభుత్వాలతో పాటు అటు మనసున్న ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. వారికి ఆహారం అందజేస్తున్నారు. ముఖ్యంగా ముంబైలో ఇరుక్కుపోయిన వలస కార్మికులను ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా వారి జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా చేరారు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి ముంబైలోని వలస కార్మికులకు అండగా నిలిచారు తమన్నా. 10వేల మంది వలస కూలీల కోసం 50 టన్నుల ఆహార పదార్థాలను తమన్నా సిద్ధం చేశారు. వలస కూలీలను ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నానని తమన్నా చెప్పారు. Also Read: ‘‘కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఈ భయంకర పరిస్థితి కొన్ని కోట్ల మంది జీవితాలపై అస్సలు ఊహించలేని విధంగా ప్రభావం చూపింది. ఈ వైరస్ను తరిమికొట్టాలంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్, సామాజిక దూరం ఒకటే మార్గం. మళ్లీ పాత పరిస్థితి రావడానికి కొన్ని వారాలు లేదంటే నెలలు పట్టొచ్చు. కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో అందరూ ఆలోచించేది వలస కూలీలు, పేదల గురించే. వాళ్ల కుటుంబాలకు చాలా కాలంపాటు ఆహారం దొరకని పరిస్థితి. అందుకే, నేను లెట్స్ఆల్హెల్ప్.ఓఆర్జీతో చేతులు కలిపాను. ఈ లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదని ప్రతిజ్ఞ చేశాను. అంతేకాదు, ఇలాంటివారిని ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తు్న్నాను’’ అని తమన్నా చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XQvyOt
v
No comments:
Post a Comment