Tuesday, 24 March 2020

RRR అప్‌డేట్: రంగంలోకి ఎడిటర్‌.. ఇంట్లోనే వర్క్

కరోనా వైరస్ ప్రభావం వల్ల టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సినిమా సిబ్బంది అంతా ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాత్రం ఖాళీగా లేరట. తన పాన్ ఇండియా సినిమా ‘’కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారట. దీనికోసం ఎడిటర్ తమ్మిరాజును రంగంలోకి దించారట. ఇప్పటి వరకు షూట్ చేసిన సీన్స్‌ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోనే ఎడిట్ చేస్తున్నారని సమాచారం. ఔట్‌పుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదలకానున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో విడుదల చేయాలని భావించారు. కానీ, క్వాలిటీ ఔట్‌పుట్ కోసం సినిమాను జనవరికి వాయిదా వేశారు. కరోనా వైరస్ విజృంభించడానికి ముందు వరకు షూటింగ్ వేగంగా జరిగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే, ఈ సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిలో నిజమెంతో తేలాల్సి ఉంది. Also Read: ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారు. ఆయన పెన్ పవర్ ఏంటో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘సైరా’ సినిమాల్లో చూశాం. ఇప్పుడు RRRలో ఆ రెండు సినిమాలకు మించి అదిరిపోయే డైలాగులు ఉండనున్నాయని సమాచారం. సినిమాకు ఇవి కూడా హైలైట్ కానున్నాయట. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో డైలాగుల కోసం అంటూ ప్రత్యేక జాగ్రత్త ఏమీ తీసుకోరు. సాధారణంగానే ఉంటాయి. కానీ, RRRలో మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయట. ఎన్టీఆర్ తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు అదిరిపోతాయని అంటున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JdPvWN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...