మెగాస్టార్ చిరంజీవికి గుండె పట్టేసిందట. నిన్న జరిగిన ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరు చీఫ్ గెస్ట్గా హాజరైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు యాంకర్ భరద్వాజ్ కూడా వచ్చారు. అయితే అనసూయ అక్కడికి సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిందని చిరుకి తెలీదు. ఆయన స్పీచ్ అంతా పూర్తయ్యాక అనసూయను చూసి పంచ్ వేసారు. ‘అనసూయ నువ్వేంటి ఇక్కడ. నువ్వూ ఈ సినిమాలో యాక్ట్ చేసావా? లేక గెస్ట్గా వచ్చావా’ అని అడిగితే.. ‘గెస్ట్ గానే వచ్చాను సర్’ అని చెప్పింది. ఆ తర్వాత ఉన్నట్టుండి చిరు గుండె పట్టుకుని ‘పట్టేసింది. ఇంతకుముందు కూడా ఛాతి నొప్పి వస్తే డాక్టర్లకు చూపించుకున్నాను. గట్టి గుండె అని చెప్పారు. అనసూయ ఈ విషయం రామ్ చరణ్కి చెప్పు’ అన్నారు. దాంతో అక్కడున్నవారంతా నవ్వకున్నారు. అయితే చిరు గుండె పట్టేసినట్లు యాక్ట్ చేస్తున్నారా, లేక నిజంగానే పట్టేసిందా అన్నది తెలీదు కానీ అక్కడున్నవారంతా కేకలు వేయడం విచిత్రంగా ఉంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ రంగమ్మత్త అనే కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో రామ్ చరణ్.. రంగమ్మత్త అంటూ అనసూయ వెంటపడటం బాగా కుదిరింది. ప్రతీ విషయం రంగమ్మత్తతో చెప్పుకుంటూ ఉంటాడు. అందుకే చిరంజీవి ఆ డైలాగ్ కొట్టారు. ‘ఓ పిట్ట కథ’ సినిమాలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు విశ్వంత్ హీరోగా నటించారు. బ్రహ్మాజీ అడగ్గానే చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. READ ALSO: దాంతో బ్రహ్మాజీ ఎమోషనల్ అయిపోయారు. చాలా మంది చిరంజీవి ఇంట్లో ఉన్న హీరోలనే పట్టించుకుంటారని, బయటి వాళ్లను పట్టించుకోరని అంటారని అందులో ఏమాత్రం నిజం లేదని బ్రహ్మాజీ. ఎవరైనా ఆయన్ని పల్లెత్తి ఒక్క మాట అన్నా కూడా చంపేస్తామని హెచ్చరించారు. చిరు గురించి మాట్లాడుతూ స్టేజ్పైనే కన్నీరుపెట్టుకున్నారు బ్రహ్మాజీ. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32HXDrz
v
No comments:
Post a Comment