Monday, 23 March 2020

జనంపై వర్మ సెటైర్లు... బాగా చెప్పారంటున్న నెటిజన్స్

మరోసారి వర్మ తన మార్క్ చూపించారు. వివాదాలు,సంచలనాల దర్శకుడు వర్మ ఏం చేసిన న్యూసే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్మ.... చేసిన ట్వీట్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆయన సెలబ్రిటీల మీద కాకుండా జనాన్ని టార్గెట్ చేశాడు. ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా మనకు సేవ చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, మీడియా కోసం చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇవాళ మాత్రం లాక్ డౌన్ ఉన్నప్పటికీ అవన్నీ బేఖాతరు చేశారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా యధేచ్ఛగా రోడ్లపై తిరిగారు. దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీరియస్ అయ్యారు. లాక్‌డౌన్‌ ప్రభుత్వం ఎందుకు పెట్టిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు ప్రధాని. మనకోసం మనందరి కోసం లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వర్మ సైతం జనం తీరుపై మండిపడ్డారు. నిన్న ఎవరికోసం అయితే చప్పట్లు కొట్టారో... ఇవాళ వారినే ప్రజలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే భారతీయుల గొప్ప సంఘీభావం అంటూ ఎద్దేవా చేశారు. అయితే వర్మ ట్వీట్‌పై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. ‘మరి నీ డ్యూటీ ఇలా నాన్ సెన్స్ ట్వీట్స్ వేయడమా ? సడన్లీ రెస్పాన్స్ బుల్ సిటిజిన్ లెక్క మట్లాడకు’ అని ఓ నెటిజన్ వర్మ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. అయితే చాలామంది మాత్రం వర్మ ట్వీట్‌కు మద్దతు పలికారు. సూపర్ సార్, బాగా చెప్పారు అంటూ కామెంట్స్ పెట్టారు. మరికొందరు ఇండియన్స్ అంతే ఎవరూ మార్చలేరంటూ బదులిచ్చారు. మరో నెటిజన్ డైలీ లైఫ్‌‌లో కొన్ని పనుల కోసం బయటకు వెళ్లకుండా ఎలా సార్ అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద వర్మ ట్వీట్‌పై నెటిజన్స్ తమకు తోచిన విధంగా రెస్పాండ్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UctIFm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...