మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా (యాక్టివ్ ప్రెసిడెంట్) నటుడు బెనర్జీని నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ వీకే నరేష్ 41 రోజులు సెలవు పెట్టడంతో డిసిప్లినరీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి నియమనిబంధనల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. బుధవారం సాయంత్రం ‘మా’ కార్యాలయం పక్కనే ఉన్న ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగా స్టార్ చిరంజీవి, మురళీమోహన్, జయసుధ పాల్గొన్నారు. వీరితో పాటు యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల, శివ బాలాజీ, అనితా చౌదరి, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్ టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ, సురేష్ కొండేటి, తనీష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆ మధ్య జరిగిన ‘మా’ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న రాజశేఖర్.. మీడియా ముందే అసోసియేషన్లో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడారు. ఈ గొడవల గురించి వేదికపై మాట్లాడవద్దని అంతకు ముందు చిరంజీవి సూచించినప్పటికీ రాజశేఖర్ ఆ మాటలను పట్టించుకోకుండా తన మనసులో ఆవేదనను బయటపెట్టేశారు. అయితే, రాజశేఖర్ ప్రవర్తించిన తీరు పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. రాజశేఖర్పై కఠిన చర్యలు తప్పవని అప్పుడే చిరంజీవి వెల్లడించారు. ఆ వెంటనే రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. Also Read: ఈ వ్యవహారం తరవాత ‘మా’కు ఒక క్రమశిక్షణా కమిటీ ఉండాలని భావించి డిసిప్లినరీ అండ్ రీకాన్సిలేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీ మోహన్, మోహన్ బాబు, జయసుధలను సభ్యులుగా నియమించారు. ఇప్పుడు ఆ కమిటీ ఆధ్వర్యంలోనే బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద పెద్దలంతా కలిసి ‘మా’లోని పరిస్థితులను చక్కదిద్దినట్టు కనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wrPHyM
v
No comments:
Post a Comment