Wednesday, 4 March 2020

కరోనా ఎఫెక్ట్: ఏడు నెలలు వాయిదాపడ్డ స్టార్ హీరో సినిమా

కరోనా వైరస్ ఎఫెక్ట్‌ సినిమాలపై బాగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అవుట్‌డోర్ షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారు. కావాలంటే షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు కానీ ఎక్కడా ఎయిర్‌పోర్ట్స్‌లో కనిపించడంలేదు. అయితే స్టార్ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ నటించిన ‘’ సినిమా కరోనా ఎఫెక్ట్ వల్ల ఏకంగా ఏడు నెలలు వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘జేమ్స్ బాండ్’ సిరీస్ నుంచి రాబోతున్న చివరి సినిమా ఇది. దాంతో ఫ్యాన్స్‌ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా రోజురోజుకీ వ్యాప్తిచెందుతుండడంతో ఆ ఎఫెక్ట్ ఎక్కడ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందోనని నవంబర్‌ 25కు పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు. యూకేలో మాత్రం ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతుంది. మిగతా దేశాల్లో నవంబర్ 25న విడుదల చేస్తారు. బాండ్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. జేమ్స్ బాండ్ సిరీస్ నుంచి వచ్చిన చివరి సినిమా 2015లో రిలీజ్ అయింది. ఓవర్‌సీస్ థియేటర్స్‌లో ఈ సినిమా 679 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అందులో చైనా నుంచే 84 మిలియన్ డాలర్లు రాబట్టింది. కరోనా పుట్టిందే చైనాలో కాబట్టి అక్కడి ప్రజలకు సినిమాలు చూసే అవకాశం లేదు. దాంతో ఈ సినిమా అక్కడ రిలీజ్ చేయరనే చెప్పాలి. READ ALSO: ఇప్పటికే చైనా, జపాన్, సౌత్ కొరియాలో పబ్లిసిటీ ప్లాన్స్ క్యాన్సిల్ చేసారు. గత వారం ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటిస్తున్న ‘మిషన్: ఇంపాజిబుల్’ ఏడో సిరీస్‌ షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇలా అనుకున్న షెడ్యూల్‌కి షూటింగ్స్ పూర్తి కాకపోవడంతో నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. మరోపక్క థియేటర్ ఓనర్స్ కూడా గగ్గోలు పెడుతున్నారు. సినిమాలను అనుకున్న తేదీకి రిలీజ్ చేయలేకపోతుండడంతో వారు కూడా నష్టపోతున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39pJ7r5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...