Wednesday, 4 March 2020

కరోనా... మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ వార్నింగ్

కరోనా.. మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావన్న విషయం మర్చిపోకు అంటూ ప్రపంచాన్ని హడలుగొడుతున్న కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చారు దర్శకుడు . ఈ మేరకు ఆయన ట్విటర్లో అర్థవంతమైన ట్వీట్ పెట్టారు. ‘‘డియర్ వైరస్, బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూపోయే బదులు నువ్వు కూడా చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలుసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే. నా మాటపై నమ్మకం లేకపోతే వెంటనే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకో. కాబట్టి నీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్వు బతుకు, మమ్మల్ని బతకనివ్వు. నీకు కూడా జ్ఞానం ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను’ అని ట్వీ్ట్ చేసారు. దీనిపై నెటిజన్లు కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘వర్మ గారూ వైరస్‌కి మీలాగా ట్విటర్ అకౌంట్ లేదు. కావాలంటే నేరుగా హాస్పిటల్‌కి వెళ్లి దానికి డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇవ్వండి’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు కరోనాపై ఈరోజు ఉదయం వర్మ అదిరిపోయే ట్వీట్ పెట్టారు. మనం ఇంతకాలం ఎన్నో చైనీస్ వస్తువులను చాలానే ఉపయోగించాం. ఇప్పుడు చావు కూడా చైనాదేనా అని కామెంట్ చేసారు. ‘‘చివరికి మన చావు కూడా మేడ్ ఇన్ చైనా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు’’ అని హిలేరియస్ ట్వీట్ పెట్టారు. చైనాలోని వుహాన్‌లో ఈ కరోనా మహమ్మారి పుట్టింది. అక్కడ దాదాపు రెండు వేల మందికి పైగా ఈ వైరస్ బారినపడి చనిపోయారు. అందుకే వర్మ ఇలా ట్వీట్ పెట్టారు. READ ALSO: మొన్నటి వరకు చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనా ఇప్పుడు ఇండియాకూ వచ్చేసింది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. అతన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియాలో ఇరవైకి పైగా కరోనా కేసులు నమోదయ్యాయట. వారిలో పదహారు మంది ఇటాలియన్ పర్యాటకులుగా గుర్తించారు. దాంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IhM80z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...