Friday, 20 March 2020

ప్రభాస్‌ని నిర్భంధించిన కరోనా.. ప్రత్యేక విమానంలో ఇంటికి!

ఇటీవల సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్తూ మాస్క్‌తో కనిపించారు. మార్చి మొదటి వారంలో విదేశాలకు వెళ్లిన ప్రభాస్.. జార్జియా, ఫ్రాన్స్ దేశాల్లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలను జార్జియాలో చిత్రీకరించారు దర్శకుడు రాధాక్రిష్ణ. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో షూటింగ్‌లను మొత్తం నిలిపివేశారు. దీంతో జార్జియా నుంచి ప్రత్యేక విమానంలో ఇండియా వచ్చిన ప్రభాస్.. స్వీయ నిర్భంధంలో ఉండిపోయారు. ఆయనతో పాటు పూజా, చిత్ర యూనిట్ కూడా స్వీయ నిర్భంధంలోనే ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలాసార్లు వాయిదా పడటంతో నిర్మాతలకు మరింత ఆర్ధిక భారంగా మారింది. ఈ తరుణంలో కరోనా ప్రభావంతో మరోసారి వాయిదా పడటం సినిమా విడుదలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభాస్ కొత్త చిత్రానికి ‘జాన్’, ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సెలబ్రిటీలు సైతం ప్రచారం కల్పిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాణాంతకర వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వీయ నిర్భంధంలో ఉంటున్నారు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా అవైర్‌నెస్ కల్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సహా అనేక మంది సెలబ్రిటీలు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల్ని తెలియజేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wqr3P9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...