ప్రముఖ చైనీస్ నటుడు జాకీ చాన్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ప్రపంచానికే పెను ముప్పుగా మారిన కరోనా వైరస్కు మెడిసిన్ కనిపెట్టే వారికి భారీ ఆఫర్ ప్రకటించారు. ఈ వ్యాధిని తగ్గించే మందు ఎవరు కనిపెట్టినా వారిని 1 మిలియన్ యువాన్ (కోటి రూపాయలు) కానుకగా ఇస్తానని ప్రకటించారు. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ సోకి బాధపడుతున్నవారికి అవసరమైన వస్తువుల కోసం భారీ విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా చాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ వైరస్ను అంతమొందించాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీతోనే సాధ్యం. నాలాగే చాలా మంది ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. త్వరలో ఈ వ్యాధిని తగ్గించేందుకు మందు కనిపెడతారని ఆశిస్తున్నాను. నాకు ఓ మంచి ఐడియా వచ్చింది. కరోనా వైరస్ను తగ్గించేందుకు ఏ వ్యక్తి మందు కనిపెట్టినా, అది ఏ సంస్థ అయినా ఫర్వాలేదు వారికి కోటి రూపాయలు ఇచ్చి ధన్యవాదాలు చెప్తాను’ అని వెల్లడించారు జాకీ చాన్. READ ALSO: నెల కిందట చైనాలో బయటపడ్డ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఇప్పటివరకు మహమ్మారిగా ప్రకటించనప్పటికీ ముందుముందు ప్రపంచం ఎదుర్కోబోయే మహమ్మారి ఇదే కావచ్చన్న అంచనాలతో సిద్ధమవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ప్రకారం చూస్తే కరోనా వైరస్ను మహమ్మారిగా ప్రకటించడానికి ఇంకో అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇది ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుండడమే కాకుండా చైనా పొరుగు దేశాలంతటా, వాటిని దాటి ఇతర దేశాలకూ వ్యాపించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38g3fv3
v
No comments:
Post a Comment