Tuesday, 18 February 2020

అజిత్ ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేసారా.. నటుడు పృథ్వీ షాకింగ్ వ్యాఖ్యలు

కోలీవుడ్‌లో తల అగ్ర కథానాయకుడు. ఆయన అద్భుతమైన నటుడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. అలాంటి అజిత్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసారు సినీ నటుడు పృథ్వీ. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను అజిత్‌ని తప్పుగా అర్థం చేసుకున్నానని అన్నారు. అసలు ఏం జరిగిందంటే.. అజిత్, పృథ్వీ సోదరి ఒకే స్కూల్లో చదువుకున్నారట. అయితే పృథ్వీ చెల్లెలు ఇంటికి రాగానే ఆమె డ్రెస్‌కు బబుల్ గమ్ అంటుకుని ఉండేదట. రోజూ ఇలాగే జరుగుతుంటే పృథ్వీ ఏం జరిగిందని అడిగారట. అప్పుడు ఆమె స్కూల్లో పృథ్వీ అనే వ్యక్తి ర్యాగింగ్ చేస్తున్నాడని చెప్పిందట. అయితే పృథ్వీ అజిత్ కుమార్ ర్యాగింగ్ చేస్తున్నాడనుకుని అతనిపై కోపం పెంచుకున్నాడట. ఆ తర్వాత ఇదే విషయం అజిత్‌కు చెబితే.. ర్యాగింగ్ చేసింది అజిత్ కుమార్ కాదు అజిత్ మేనన్ అని తెలిసిందట. దాంతో తాను ఎంత తప్పుగా ఆలోచించాను అనుకుని పృథ్వీ బాధపడ్డారట. ఈ విషయాన్ని అజిత్ కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమాయ్’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 1998లో వచ్చిన ‘అవల్ వరువల’ అనే సినిమాలో అజిత్, పృథ్వీ కలిసి నటించారు. ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది అజిత్ నటించిన ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మించారు. ఇక పృథ్వీ విషయానికొస్తే ఆయన తెలుగు సినిమాల్లో కనిపించడం బాగా తగ్గిపోయింది. బెంగళూరులో సెటిల్ అయిపోయిన పృథ్వీ ఇటీవల జబర్దస్త్ కామెడీ షోలో కనిపించి సర్‌ప్రైజ్ చేసారు. ఈ వయసులోనూ ఆయన హ్యాండ్సమ్‌గా ఉన్నారు. తెలుగులో అవకాశాలు వస్తే తప్పకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39IOcKJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...