Friday, 7 February 2020

నాగశౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలి.. హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

సినీ హీరో నాగశౌర్యపై తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య ట్యాక్సీ డ్రైవర్ల పట్ల అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదులో జేఏసీ నాయకులు పేర్కొన్నారు. చదువుకోని కొంత మంది, మద్యానికి బానిసలైన డ్రైవర్లు నేరాలకు పాల్పడుతున్నారని నాగశౌర్య ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్టు కమిషన్‌కు వివరించారు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన నాగశౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాగా, నాగశౌర్య హీరోగా ‘అశ్వథ్థామ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 31న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కథను నాగశౌర్యనే అందించారు. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమయ్యారు. నాగశౌర్య తొలిసారి యాక్షన్ హీరోగా నటించిన ఈ సినిమాను సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై నిర్మించారు. ఆయన తల్లి ఉషా మూల్పూరి నిర్మాత. Also Read: అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇటీవల నాగశౌర్య ఓ న్యూస్ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడానికి కారణాలను వెల్లడించారు. చదువుకోకపోవడం వల్ల కొంత మంది ఇలాంటి పనులు చేస్తున్నారని, ఒకవేళ వాళ్లు చదువుకుంటే ఇలాంటివి చేయకూడదనే భయం వాళ్లలో ఉంటుందన్నారు. అలాగే, డ్రైవర్లు తాగేసి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. బహుశా ఈ మాటలే ట్యాక్సీ డ్రైవర్లకు ఆగ్రహం తెప్పించినట్టుంది. మరి, దీనిపై నాగశౌర్య స్పందిస్తారో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ugtYcp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...