Friday, 21 February 2020

‘ఉప్పెన’ కొత్త పోస్టర్.. రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా?

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దాదాపు పది మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. తాజాగా మరో యంగ్ హీరో వెండితెరకు పరిచయం అయ్యేందుకు రెడీ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్టవ్‌ తేజ్‌ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. వైష్ణవ్ నటిస్తున్న ఉప్పెన సినిమా నుంచి మరో లుక్ ఈరోజు రిలీజ్ అయింది. వైష్ణవ్ బావ రామ్‌ చరణ్ ఈ లుక్‌ను రిలీజ్ చేసారు. ‘వెల్‌కం టు వైష్ణవ్ తేజ్. ఈ జర్నీ తప్పకుండా ఎంజాయ్ చేసావ్. నీ జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తావ్. ఆల్ ది బెస్ట్’ అని విష్ చేసారు. ఇక పోస్టర్‌లో వైష్ణవ్‌ తేజ్ కృతి శెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను వెనకనుంచి చూసి మురిసిపోతున్నట్లుగా కనిపించారు. ఫస్ట్ రిలీజ్ చేసిన లుక్‌లో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఉప్పెన అనే టైటిల్ చూస్తే ఈ సినిమాలో వైష్ణవ్‌ రోల్‌ ఎగ్రెసివ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు నిర్మాతలు. స్టార్‌ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. READ ALSO: వైష్ణవ్‌కు జోడిగా కృతి శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తుండటం సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. సాయి చంద్‌, బ్రహ్మాజీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలి సినిమాతోనే అంచనాలు పెంచేసాడు వైష్ణవ్ తేజ్. మరి తన అన్న, బావల్లాగే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PcGl02
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...