Sunday, 16 February 2020

‘‘అల వైకుంఠపురంలో’’ కథ నాది.. త్రివిక్రమ్‌కు నోటీసులు పంపుతా’’

‘బాహుబలి’ తర్వాత అంతటి స్థాయిలో విజయం సాధించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ నాదంటూ కృష్ణ అనే దర్శకుడు షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. 2005లో తాను త్రివిక్రమ్‌ను కలిసానని అదే సమయంలో అల వైకుంఠపురములో కథ చెప్పానని అంటున్నారు. అంతేకాదు, 2013లో ఈ కథని ఆయన ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నానని ఆరోపిస్తున్నారు. తన కథను వాడుకుంది కాకుండా కనీసం క్రెడిట్స్‌లో తన పేరును ఎక్కడా ప్రస్తావించలేదని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. త్వరలో త్రివిక్రమ్‌‌కు నోటీసులు పంపుతానని హెచ్చరించారు. ఈ సినిమా కథను త్రివిక్రమ్ కాపీ కొట్టాడని గతంలో సినీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు ఇది ప్రమాదకరమైన సినిమా అంటూ వివాదాస్పద పోస్ట్‌లు చేసారు. READ ALSO: ‘‘గొప్పోడి కొడుక్కి గొప్పగుణాలే వస్తాయి. దుర్మార్గుడి కొడుక్కి దుర్మార్గపు లక్షణాలు రాకపోయినా గొప్పోడైతేకాడు. కాలేడు. బహుశా ఈ పంథా మనువాద ధోరణి సహజంగా అలవడిన దర్శకుడు ఇదే మంచికథ అనుకోవడంలో తప్పులేదు. సినిమా ఎంతబాగా ఉంటే ఒక్కోసారి అంత ప్రమాదం. ఎందుకంటే, "బాగుంది" అనుకుంటూ అనుకుంటూ మనం "నిజమేకామోసు" అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి. 'అల వైకుంఠపురంలో' అటువంటి ఒక ప్రమాదకరమైన సినిమా. అన్యాపదేశంగా, పుట్టుకతో సంక్రమించే కులాన్ని, తద్వారా సమాజంలో వచ్చే ప్రివిలైజస్‌ని, వివక్షని సాధారణీకరించే భావజాలాన్ని వ్యాప్తిచేసేకథ ఇది’’ అని కత్తి పేర్కొన్నారు. మరి తాజాగా దర్శకుడు కృష్ణ చేస్తున్న ఆరోపణలపై త్రివిక్రమ్ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bDGjbk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...