Saturday, 8 February 2020

‘నిశ్శబ్దం’ వీడిన అనుష్క.. రిలీజ్ డేట్ ఫిక్స్

దక్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి అనుష్క శెట్టి. యంగ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్‌ను కూడా ఏర్పరుచుకున్నారు అనుష్క. తన క్రేజ్‌కు తగ్గట్టుగానే అనుష్క సినిమాల ఎంపిక కూడా ఉంటుంది. మిగిలిన హీరోయిన్ల మాదిరిగా కాకుండా స్క్రిప్టులను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఓకే చేసిన సినిమా ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా ఎప్పుడో పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విడుదల తేదీని ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రాస్ జోన‌ర్ చిత్రంలో సాక్షి అనే వైవిధ్యమైన పాత్రలో అనుష్క మెప్పించ‌నున్నారు. మాట్లాడలేని అమ్మాయి పాత్రలో అనుష్క నటించారు. అలాగే మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బరాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల, మైకేల్ మ్యాడ్‌సన్ ఇత‌ర కీల‌క పాత్రలు పోషించారు. విలన్‌గా నటిస్తోన్న హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్‌సన్ ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలోని పాత్రల లుక్స్‌తో పాటు ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. Also Read: కాగా, ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. చాడ్ రాప్టోర్ ఆర్ట్ డైరెక్టర్. ఆలెక్స్ టెర్జీఫ్ స్టంట్ కొరియోగ్రాఫర్. షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. కోన వెంక‌ట్ స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక బృందంలో చాలా మంది హాలీవుడ్‌కు చెందినవారే కావడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2H42ysK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...