Sunday, 9 February 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటి మహానటి

ఒక మంచి పనిని మనం చేయడంతో పాటు మరో ముగ్గురు చేసేలా చేయడమే అసలైన ఛాలెంజ్. ఈ ఛాలెంజే గ్రీన్ ఇండియా. సామాజిక బాధ్యతగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఛాలెంజ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని మొక్కలను నాటడమే కాకుండా.. మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా టాలీవుడ్ ‘మహానటి’ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో మొక్కలు నాటిన కీర్తి సురేష్ గారు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ మంచి కార్యక్రమం పొల్యూషన్ పెరిగిపోతున్న సమయంలో చెట్లను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని అన్నారు కీర్తి సురేష్. ఈ కార్యక్రమంలో సినీ నటుడు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2w3gG3r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...