అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఆ తరవాత ‘గీతగోవిందం’ సినిమాతో తన మార్కెట్ను అమాంతం పెంచేశారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఆ తరవాత ‘నోటా’ సినిమాతో దక్షిణాది రాష్ట్రాలకు తన ఇమేజ్ వ్యాప్తి చేశారు. రౌడీ హీరోగా తన బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేశారు. అయితే, కిందటేడాది వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్లు కావడంతో ఇప్పుడు తన ఆశలన్నీ పూరి జగన్నాథ్ సినిమా మీదే పెట్టుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ దేవరకొండకు పదో సినిమా. పూరీకి 37వ చిత్రం. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ‘లైగర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్గా కనిపించనున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. Also Read: ఇదిలా ఉంటే, ఇది పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండను హిందీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్లోనే బడ్జెట్ పరంగా భారీ చిత్రం కాబోతోందని సమాచారం. పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం రూ.50 కోట్లు వెచ్చిస్తున్నారట. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్తో కలిసి పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ వర్షన్ను కరణ్ జోహార్ సమర్పిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32i5vje
v
No comments:
Post a Comment