Monday, 17 February 2020

‘భీష్మ’ ట్రైలర్: ప్రశాంతంగా ఉంది కదా!

నితిన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమైపోతోంది. ‘‘దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’’ అనే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. రష్మికతో రొమాన్స్, వెన్నెల కిషోర్ కామెడీ పంచ్‌ల తరవాత అసలు కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందో చూపించారు. అదే సేంద్రీయ వ్యవసాయం. ఈ సినిమాలో విలన్‌గా బెంగాల్ నటుడు జిషు సేన్‌గుప్తా నటించారు. ఈయన ఎరువుల తయారీ కంపెనీకి యజమాని. జిషు, నితిన్ మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘‘నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’’ అంటూ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్ బాగుంది. ఇక నితిన్ అభిమానులకు కావాల్సిన డిష్యుం డిష్యుంలకు కూడా కొదవలేదు. ‘‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు. అదృష్టవంతుడితో గెలవలేం’’ అని విలన్ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. చివరిగా ‘‘యు టచ్ మి ఐ పోక్ యు.. యు పోక్ మి ఐ స్క్రాచ్ యు’’ అని నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. సినిమాలో నితిన్ చాలా స్టైలిష్‌గా కనిపించనున్నారు. సినిమా వచ్చేంత వరకు ఈ ట్రైలర్‌ను ఎంజాయ్ చేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bGYNrn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...