Tuesday, 11 February 2020

సీఏఏ‌పై మీ అభిప్రాయం చెప్పండి.. ఎ.ఆర్.రెహమాన్‌ను వెంటాడిన రిపోర్టర్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్‌ఆర్‌సీ)లపై ప్రస్తుతం దేశంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సీఏఏ వల్ల భారతీయులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, కేవలం చొరబాటుదారులను మాత్రమే దేశం నుంచి వెల్లగొడతామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ చట్టం వల్ల దేశంలోని ముస్లింలు నష్టపోతారని మరో వాదన గట్టిగా వినిపిస్తోంది. అందుకే, సీఏఏపై దేశవ్యాప్తంగా వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ అభిప్రాయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఒక రిపోర్టర్. వాతావరణ మార్పు, సురక్షితమైన నీటిని అందించడంపై చెన్నైలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎ.ఆర్.రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడుతూ.. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కుళాయి నీటిని తాగే రోజు రావాలని అన్నారు. మనకు కావాల్సింది మినరల్ వాటర్ కాదని, కుళాయి నుంచి సురక్షితమైన మంచి నీరు రావాలని చెప్పారు. ఈ విషయంలో యువతలో స్ఫూర్తిని నింపేందుకు వాతావరణ మార్పుపై నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌ను సపోర్ట్ చేయడానికి వచ్చానని వెల్లడించారు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ సీఏఏపై స్పందించాలని రెహమాన్‌ను అడిగారు. దీనికి ఆయన నవ్వుతూ నిరాకరించారు. ఆగకుండా అలాగే ముందుకు వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆ రిపోర్టర్ వదల్లేదు. ఆయన వెంటపడ్డాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ రిపోర్టర్‌ను ఆపేశారు. పాపం.. రెహమాన్‌ నుంచి ఒక సమాధానం రాబట్టి దాన్ని వైరల్ చేద్దామనుకున్నాడు సదరు రిపోర్టర్. కానీ, కుదరలేదు. మొత్తానికి బర్నింగ్ ఇష్యూపై మాట్లాడటానికి మాత్రం రెహమాన్ ఆసక్తి చూపలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37e0Ob1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...