పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్ఆర్సీ)లపై ప్రస్తుతం దేశంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సీఏఏ వల్ల భారతీయులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, కేవలం చొరబాటుదారులను మాత్రమే దేశం నుంచి వెల్లగొడతామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ చట్టం వల్ల దేశంలోని ముస్లింలు నష్టపోతారని మరో వాదన గట్టిగా వినిపిస్తోంది. అందుకే, సీఏఏపై దేశవ్యాప్తంగా వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ అభిప్రాయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఒక రిపోర్టర్. వాతావరణ మార్పు, సురక్షితమైన నీటిని అందించడంపై చెన్నైలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎ.ఆర్.రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడుతూ.. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కుళాయి నీటిని తాగే రోజు రావాలని అన్నారు. మనకు కావాల్సింది మినరల్ వాటర్ కాదని, కుళాయి నుంచి సురక్షితమైన మంచి నీరు రావాలని చెప్పారు. ఈ విషయంలో యువతలో స్ఫూర్తిని నింపేందుకు వాతావరణ మార్పుపై నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ను సపోర్ట్ చేయడానికి వచ్చానని వెల్లడించారు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ సీఏఏపై స్పందించాలని రెహమాన్ను అడిగారు. దీనికి ఆయన నవ్వుతూ నిరాకరించారు. ఆగకుండా అలాగే ముందుకు వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆ రిపోర్టర్ వదల్లేదు. ఆయన వెంటపడ్డాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ రిపోర్టర్ను ఆపేశారు. పాపం.. రెహమాన్ నుంచి ఒక సమాధానం రాబట్టి దాన్ని వైరల్ చేద్దామనుకున్నాడు సదరు రిపోర్టర్. కానీ, కుదరలేదు. మొత్తానికి బర్నింగ్ ఇష్యూపై మాట్లాడటానికి మాత్రం రెహమాన్ ఆసక్తి చూపలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37e0Ob1
v
No comments:
Post a Comment