హీరోయిన్స్కు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ పట్టించుకునే సమయం ఎక్కడుంటుంది అనుకుంటారో ఏమో. ఇష్టమొచ్చినట్లు ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించేస్తుంటారు. ఒక ట్వీట్ చేసే ముందు, కామెంట్ చేసే ముందు వెనక ఆలోచించరు. పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ వారికి కూడా మనసు ఉంటుందని అనుకోరు. ఇప్పటికే ఎందరో హీరోయిన్లు సోషల్ మీడియాలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుని బాధను వ్యక్తం చేసారు. తాజాగా నటి తనకు ఎదురైన ఇన్సిడెంట్ను అందరి ముందు బయటపెట్టారు. పానీ పూరీ అనే పేరున్న ట్విటర్ ఎకౌంట్ చాందిని చౌదరితో పాటు మరికొందరు హీరోయిన్ల గురించి ఏదో వార్త రాస్తూ B గ్రేడ్ హీరోయిన్స్ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చాందిని కంటపడటంతో ఆమె అక్కడికక్కడే గట్టిగా బుద్ధి చెప్పింది. ‘‘మీడియా, జర్నలిజం ఇంతగా దిగజారిపోయిందన్నమాట. B గ్రేడ్ అంటే ఎంత పెద్ద బూతు మాటో మీకు తెలుసా? అసలు దాని అర్థం తెలుసా? మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడాలి. ఇది పరమ దరిద్రంగా ఉంది. మీలాంటి వాళ్ల వల్లే టాలెంట్ ఉన్న అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు. ఇది సిగ్గుచేటు" READ ALSO: "కొంత మంది మనం చేసే పనులపై నీరు చల్లాలని, మనల్ని తొక్కేయాలని చూస్తుంటారు. అలాంటి నెగిటివ్ ప్రజలు మానవత్వానికే మచ్చ తెచ్చే రకం. ఒకవేళ శాస్త్రవేత్త అయిన ఎడిసన్ని కూడా ఇలాగే వెక్కిరించి, ఎగతాళి చేసి ఉంటే ఏమై ఉండేదో ఆలోచించండి’’ అంటూ గడ్డిపెట్టింది చాందిని. చాందినిని మాత్రమే కాదు హెబ్బా పటేల్, బిందు మాధవిలను కూడా B గ్రేడ్ లిస్ట్లో చేర్చింది. కానీ వారెవ్వరూ ఈ వార్తపై స్పందించలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tYYB5N
v
No comments:
Post a Comment