కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు ’ సినిమా షూటింగ్ స్పాట్లో నిన్న రాత్రి పెను ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్, శంకర్, కాజల్ అగర్వాల్తో పాటు మరికొందరు టెక్నీషియన్లు పనిలో ఉన్నప్పుడు అక్కడే ఉన్న భారీ క్రేన్ టెంట్పై పడింది. దాంతో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ బాయ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై స్టైలిష్ స్టార్ స్పందించారు. ‘‘ఇందాకే ఈ షాకింగ్ న్యూస్ విన్నాను. భయంకరం, హృదయవిదారకమైన ఘటన. చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. ఈ ఘటన నుంచి కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, శంకర్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. కాజల్ అయితే వెంట్రుక వాసిలో తప్పించుకున్నానని ట్వీ్ట్ చేసారు. ఆమె ఇప్పటికీ షాక్లోనే ఉన్నారు. శంకర్ కాలు విరిగిందని తెలుస్తోంది. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బాధిత కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించారు. ఇది కేవలం ఆ కుటుంబాలు కోలుకోవడానికి ఇస్తున్న నష్టపరిహారమేనని, ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. అయితే ఇది కేవలం తన బాధ్యత కాదని, చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీలు కూడా సాయం చేస్తే బాగుంటుందని కమల్ తన మనసులో మాటను బయటపెట్టారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32acriB
v
No comments:
Post a Comment