Thursday, 20 February 2020

ఇండియన్ 2 ప్రమాదం: అందుకే హైలైట్ చేస్తున్నారు: కమల్ హాసన్

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత మొదలైంది. దాదాపు పాతికేళ్ల తర్వాత , దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తు్న్న సినిమా ఇది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో అనుకోని ప్రమాదం. నిన్న రాత్రి చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్‌లో భారీ క్రేన్ కుప్పకూలింది. దాంతో ‘భారతీయుడు 2’ సినిమా కోసం పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మెన్ అక్కడికక్కడే చనిపోయారు. కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, శంకర్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. శంకర్ కాలు విరిగిందని తెలుస్తోంది. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బాధిత కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించారు. ఇది కేవలం ఆ కుటుంబాలు కోలుకోవడానికి ఇస్తున్న నష్టపరిహారమేనని, ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. అయితే ఇది కేవలం తన బాధ్యత కాదని, చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీలు కూడా సాయం చేస్తే బాగుంటుందని కమల్ తన మనసులో మాటను బయటపెట్టారు. READ ALSO: ‘‘దీనిని బాధ్యతగా తీసుకోవాలని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను. ఏ రంగంలోనైనా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సినిమా అనేది హై ప్రొఫైల్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువగా హైలైట్ అవుతోంది. ప్రమాదం మనుషులను చూసుకుని రాదు. ఎవరికైనా ఎదురవుతుంది. నాక్కూడా ప్రమాదం జరగాల్సింది. ఎందుకంటే క్రేన్ టెంట్ మీద పడినప్పుడు నేను కూడా అందులోనే ఉన్నాను. అన్ని రకలా టెక్నీషియన్ల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T6mv8e
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...