Saturday, 15 February 2020

తారలు దిగి వచ్చిన వేళ.. అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ 2020

బాలీవుడ్‌లో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది అసోంలోని గువాహటిలో శనివారం రాత్రి ప్రారంభమైంది. ఈ 65వ అమెజాన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2020 వేడుకకు ఎప్పటిలానే తారలంతా తరలివచ్చారు. హిందీ సినిమా గ్లామర్, ఫ్యాషన్‌తో ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక వెలిగిపోయింది. ఈ ఏడాది నామినేషన్లలో జోయ అక్తర్ దర్శకత్వం వహించిన ‘గల్లీ బోయ్’ లీడింగ్‌లో ఉంది. ఆయన తరవాత అక్షయ్ కుమార్, విద్యా బాలన్ నటించిన ‘మిషన్ మంగళ్’, ఆయుష్మాన్ ఖురానా సోషల్ డ్రామా ‘ఆర్టికల్ 15’, విక్కీ కౌశల్ వార్ డ్రామా ‘ఉరి: ది సర్కికల్ స్ట్రైక్’ సినిమాలు అత్యధిక విభాగాల్లో నామినేట్ అయ్యాయి. శనివారం రాత్రి నిర్వహించిన ఈ భారీ ఈవెంట్‌కు కరణ్ జోహార్, విక్కీ కౌశల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌‌తో పాటు ఇతర సినీ తారలు వేడుకలో పాల్గొన్నారు. వీళ్లు వేడుకలో పాల్గొనడం మాత్రమే కాదు.. తమ డ్యాన్స్ పెర్ఫార్మన్స్‌లతో అదరగొట్టారు. ఈ బిగ్ ఈవెంట్‌‌ను అసోం టూరిజం సంస్థ ‘‘ఆసమ్ అస్సాం’’ హోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన పురస్కారాల్లో.. ఉత్తమ గేయ రచయితలుగా గల్లీబాయ్ చిత్రంలో ‘ఆప్నా టైమ్ ఆగయేగా’ పాట రాసిన డివైన్, అంకుర్ తివారీలకు అవార్డు దక్కింది. ఇదే చిత్రం ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఎంపికైంది. అలాగే ఎక్సలెన్స్ సినిమా అవార్డు ప్రముఖ నటుడు గోవిందాను వరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38xdY4q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...