Monday, 6 January 2020

అల వైకుంఠపురములో: బన్నీ వారసుల ఎంట్రీ.. ప్రొడక్షన్ ఖర్చు వాచిపోయిందట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడి కాంబినేషన్‌లో వస్తోన్న బన్నీ హ్యాట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ ఎలా చేస్తారు? ఏం చూపిస్తారు? అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో తన వారసులు అల్లు అయాన్, అర్హలను కూడా చూపించబోతున్నారు బన్నీ. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైమ్ నా సినిమాలో యాక్ట్ చేసిన సూపర్ స్టార్ అల్లు అయాన్‌కి, అందరికంటే మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రిల్లియంట్ స్టార్ అర్హకి థ్యాంక్స్. వాళ్లు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మేం పారిస్ నుంచి ఫోన్ చేయగానే మాకు కాల్షీట్లు ఇచ్చారు. రెండు గంటలు మాత్రమే పనిచేశారు. ఆ రెండు గంటల కోసం బోలెడంత ప్రొడక్షన్ కాస్ట్ అయ్యింది. అరవింద్ గారు, చినబాబు గారు మా వైపు పెద్ద పెద్ద కళ్లతో చూశారు. అయినప్పటికీ కూడా వాళ్లు స్టార్స్.. స్టార్స్‌లానే ఉన్నారు. వాళ్లు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్లు నటించే అవకాశం ఇచ్చిన శ్రీమతి అల్లు అర్జున్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ సినిమా వల్ల నాకు ఇంకొక మంచి జరిగింది. ఏంటంటే.. నా భార్యను నేనెప్పుడూ షూటింగ్‌లకు తీసుకెళ్లను. ‘సామజవరగమన’ షూటింగ్ చేసేటప్పుడు నా భార్యను పారిస్ తీసుకెళ్లాను. రెండు రోజులు షూటింగ్‌కి వచ్చిన తరవాత ఇక రాను అని చెప్పింది. తను నేను ఎంత కష్టపడుతున్నానో తెలిసింది. నాకు ఆ మాత్రం గౌరవం కూడా దక్కించినటువంటి ఆ పాట రాసిన సీతారామశాస్త్రి గారికి, దాన్ని స్వరపరిచిన తమన్‌కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పను’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tzkyrA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...