Monday, 6 January 2020

మనసు దురదపెట్టినప్పుడు గోక్కునే దువ్వెన సంగీతం: త్రివిక్రమ్

సంగీతమంటే మనసు దురపెట్టినప్పుడు గోక్కునే దువ్వెన లాంటిదని మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. ఆయన దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా మ్యూజికల్ కాన్సెర్ట్ (ప్రీ రిలీజ్ ఈవెంట్)ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ అలరించారు. ‘‘ఓ రూమ్‌లో మ‌ధ్యాహ్నం 3-4 గంట‌ల ప్రాంతంలో దాదాపు ప్రపంచమంతా మధ్యాహ్నం భోజనం చేసి మత్తులో ఉన్న సమయంలో, పెద్దగా ట్రాఫిక్ లేని స‌ందర్భంలో 30 ఏళ్ల యువ‌కుడు, 60 ఏళ్ల పెద్దాయ‌న కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృద‌యాల‌ను తాకింది. అదే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న. త‌న వ‌య‌సు నుంచి దిగి ఆయ‌న‌, త‌న వ‌య‌సును ఎక్కి త‌మ‌న్ క‌లిసి ఓ కామన్ పాయింట్‌ను క‌లిసి ఈ చిత్రానికి ఈ స్థాయిని తీసుకొచ్చారు’’ అని అన్నారు త్రివిక్రమ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి, తమన్ కలిసి ఒక అద్భుతమైన కలని, జ్ఞాపకాన్ని ఇచ్చారని త్రివిక్రమ్ వెల్లడించారు. దానికి త‌న‌ గొంతునిచ్చిన సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను మ‌న అంద‌రి గుండెల్లోకి తీసుకొచ్చేశాడన్నారు. ‘‘శ్యామ్ గారు చెప్పినట్టు ఒక పాట మ‌న‌కు ఊతం చేయి ప‌ట్టుకుని న‌డ‌వొచ్చు.. ఒక పాట మ‌న‌కు స్నేహితురాలు మ‌న క‌ష్టాలు చెప్పుకోవచ్చు. అది మ‌న ప్రేయ‌సి త‌న ఒళ్లో మ‌న త‌లను పెట్టుకుని ప్రేమ‌ను పొంద‌వ‌చ్చు. మ‌న గురువు.. మ‌న‌కు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు జ్ఞానాన్ని బోధిస్తుంది. అలాంటి పాట‌ను ఇచ్చిన వారిని గౌర‌వించాల‌నిపించింది. అందుకే దీనికి మ్యూజిక‌ల్ నైట్ పేరు పెట్టి కండ‌క్ట్ చేశాం’’ అని వివరించారు త్రివిక్రమ్. Also Read: మ్యూజికల్ నైట్ కండక్ట్ చేయడానికి ప్రధాన కారణం హీరో అల్లు అర్జున్ అని చెప్పారు త్రివిక్రమ్. ‘‘ఎంతో సంస్కారంతో ఈ కోరిక‌ను బ‌లంగా బయటకు తీసుకొచ్చింది అల్లు అర్జున్‌. బన్నీ అంటే చిన్న పిల్లాడిలా ఉంటుంది. ఆయన పెద్దాడిలా ఆలోచించాడు. అందుకే అల్లు అర్జున్ అనే అంటాను. ‘జులాయి’ నుంచి పెళ్లి కాని యువకుడిగా నాకు తెలుసు. ఇప్పుడు పెళ్లయి ఇద్దరి పిల్లల తండ్రిగా త‌న తాలూకు మెచ్యూరిటీని త‌న మాట‌లు, జీవితంలో, ప‌నిలో ప్రతి దాంట్లో పెడుతున్నాడు’’ అని అల్లు అర్జన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మేం క‌నే క‌ల మీ అంద‌రికీ మంచి జ్ఞాప‌కం కావాలి. దీని కోసం మేం ఎంత అడ్వేంచ‌రెస్‌గా నిర్ణయాలు తీసుకున్నా, మీ వెనుక మేం ఉన్నామంటూ అర‌వింద్‌ గారు, చినబాబు గారు నిల‌బ‌డి మేం అడిగిందల్లా గొప్పగా ఇచ్చారు. ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ మ‌న‌స్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ప‌నిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ర‌కంగా మ‌న‌సుకు ద‌గ్గరైన వాళ్లే. వాళ్లంద‌రికీ నేను చెప్పే మాట ఒక‌టే.. వాళ్లంద‌రితో నేను ప్రేమ‌లో ఉన్నాను. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత కొద్దిపాటి విర‌హాన్ని అనుభ‌విస్తాను. మ‌ళ్లీ ఓ క‌థ‌ను రాస్తాను. మ‌ళ్లీ మిమ్మల్ని క‌లుస్తాను. Also Read: ఈ సినిమాకు మొద‌లు, చివ‌ర అల్లు అర్జునే. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏది చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు. అప్పటి నుండి 11 నెల‌లు పాటు ఈ జ‌ర్నీ చేశాం. మేం కాకినాడ‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు పాట‌ల లిరిక‌ల్ వీడియోలు రొటీన్‌గా ఉన్నాయి.. పాట కోసం ప‌నిచేసే టెక్నీషియ‌న్స్ క‌నిపించేలా ఏదైనా కొత్తగా చేద్దామ‌ని ఆయ‌న అన్నారు. అదే మీరు చూసిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట‌. అలా నాతో స‌హా అంద‌రినీ ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. ఆయ‌న లైఫ్‌లో ఇంకా చాలా ముందుకు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను. ఆ ప్రయాణంలో మేం కూడా భాగ‌మ‌వుతాం. మేం ప‌నిచేయ‌లేని సినిమాల‌కు మేం సాక్షుల‌మ‌వుతాం, ప్రేక్షకుల‌మ‌వుతాం. మేం ప‌నిచేసే సినిమాల‌కు ద‌ర్శకుల‌మ‌వుతాం. అంద‌రి ప్రేమ మాపై ఇలాగే ఉండాలి. 12న క‌లిసి పండ‌గ చేసుకుందాం. ఆనందంగా ఉంది. అల వైకుంఠ‌పుర‌ములో మీకు స్వాగతం ప‌లుకుతుంది’’ అని అన్నారు మాటల మాంత్రికుడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FtANsM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...