మెగా వారసుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పుడు వరుసగా ఫ్లాప్స్ రావడంతో బాగా సతమతమైన సాయి తేజ్ ‘చిత్ర లహరి’తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ‘ప్రతిరోజూ పండగే’తో ఆయన ఉత్సాహం రెట్టింపైంది. అయితే ఇటీవల ఈ సినిమాను సాయి తేజ్ మేనమామ, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించారు. సినిమా తనకు చాలా నచ్చిందని తెలుపుతూ సాయి తేజ్కు బొకే పంపారు. ‘డియర్ గారు... ‘ప్రతిరోజూ పండగే’ సినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. మీరు భవిష్యత్తులో చేయబోయే సినిమాలకు ఆల్ ది బెస్ట్’ అని పేర్కొన్నారు. READ ALSO: అయితే పవన్.. తన మేనల్లుడిని ‘సాయి ధరమ్ తేజ్ గారూ’ అని గౌరవంగా పిలవడం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. ‘వరసకు మేనల్లుడైనా గారు అని సంబోధించారు. మామా అల్లుళ్ల అనుబంధం’ అంటూ ఫ్యాన్స్ పవర్స్టార్ను ఆకాశానికెత్తేస్తున్నారు. పవన్ ట్వీట్కు ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘మాటలు సరిపోవడం లేదు. ధన్యవాదాలు అన్న పదం కూడా చాలా చిన్నది. లవ్యూ పవన్ కళ్యాణ్ మామా’ అని పేర్కొన్నారు. సాయి తేజ్ నటించిన ‘చిత్రలహరి’ సినిమా సక్సెస్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇదే విధంగా బొకే పంపి మరీ కంగ్రాట్స్ చెప్పారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది కాబట్టి.. బన్నీకి కూడా పవన్ కంగ్రాట్స్ చెప్తారేమో వేచి చూడాలి. See Photo Story: ‘ప్రతిరోజూ పండగే’ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. సత్యరాజ్ తండ్రిగా తాతయ్యగా కీలక పాత్ర పోషించారు. ఎమోషన్స్తో నిండిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tXsIug
v
No comments:
Post a Comment