Monday, 13 January 2020

‘డిస్కోరాజా’ టీజర్ 2.0: వయసు కాదు.. భయం గుర్తుకురావాలి!

మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. బాబీ సింహా ప్రతినాయకుడి పాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. రవితేజ స్టైలిష్ లుక్‌తో అభిమానులను అలరించారు. అయితే, తాజాగా రెండో టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో విలన్ పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పేరు సేతు. ఇప్పటి వరకు తమిళ సినిమాల్లో విలన్‌గా అలరించిన తెలుగు నటుడు బాబీ సింహా.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘‘సేతు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం.. భయం గుర్తుకురావాలి’’ అంటూ బాబీ సింహా చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌ అవుతోంది. Also Read: ఇక ఆ తరవాత రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. టీజర్లు చూస్తుంటే ఈ సినిమాలో రవితేజ చాలా కొత్తగా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ‘‘ఎనీవన్ ఎల్స్.. వాన్నా డ్యాన్స్ విత్ మి?’’ అనే డైలాగ్ చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్‌కి డ్యాన్స్ చేస్తూ గన్‌తో విలన్‌ను కాల్చుతూ ‘‘ఐ లవ్ ఫ్రీకింగ్ ఫియర్ ఇన్ యువర్ ఐస్’’ అని రవితేజ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. టీజర్‌లో వచ్చిన సీన్లలో తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. మొత్తం మీద ఈ సినిమాతో మాస్ మహారాజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేటట్టే కనిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Tjzepv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...