Sunday, 12 January 2020

ద్యావుడా... అలా వచ్చి ఇలా వెళ్లినందుకు కోటిన్నర పారితోషికం

సినీ పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. అందులోకి అడుగుపెట్టి కాస్తంత పాపులారిటీ తెచ్చుకుంటే చాలు డబ్బుకు డబ్బు పేరుకి పేరు వస్తుంది. ఒకవేళ విఫలమైతే మాత్రం ఆ తర్వాత జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహించుకోలేం కూడా. ఒకవేళ స్టార్ హోదా సంపాదించుకుంటే మాత్రం ప్రేక్షకులు వారిని దేవుళ్లతో సమానంగా చూస్తారు. అప్పుడు చేతిలో సినిమాలు లేకపోయినా ప్రకటనలకు, ఈవెంట్లకు హాజరయ్యేందుకు బాగా సమర్పించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందిన పలువురు పవర్ కపుల్స్ ఇలాంటి ప్రకటనలు, ఈవెంట్స్‌కు ఒప్పుకుంటూ కోట్లు సంపాదించేస్తున్నారు. ఈ చర్చంతా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల గురించి. వీరిద్దరూ బాలీవుడ్‌లో పవర్ కపుల్. ఇటీవల ఓ బేబీ కేర్ ప్రొడక్ట్ లాంచ్ కోసమని ఓ ఈవెంట్ నిర్వాహకులు సైఫ్, కరీనాను ఆహ్వానించారట. ఇందుకు అడిగినంత ఇస్తామని కూడా చెప్పారట. దాంతో వారిద్దరికీ కలిపి కోటిన్నర అడిగారు. అది కూడా కేవలం మూడు గంటల పాటు ప్రోగ్రామ్‌లో ఉండటానికి. అడిగినంత ఇవ్వడానికి ఈవెంట్ నిర్వాహకులు కూడా ఒప్పుకున్నారు. READ ALSO: అయితే ఈ ప్రొడక్ట్ లాంచ్‌కి కరీనా, సైఫ్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే.. వారి ముద్దుల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ వల్ల. తైమూర్‌కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. తైమూర్‌ని ఈవెంట్‌కి తీసుకొస్తే తమ బ్రాండ్‌ను బాగా ప్రమోట్ చేసుకోవచ్చని అనుకున్నారు. ఇది ఇప్పటి ఆలోచన కాదు. దాదాపు ఏడాదిగా నిర్వాహకులు కరీనా, సైఫ్, తైమూర్‌ల కోసం వేచి చూస్తున్నారు. మొత్తానికి భారీగా పారితోషికం సమర్పించుకున్నాక ఈవెంట్‌కు రావడానికి కరీనా, సైఫ్ ఒప్పుకున్నారట. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RaTsiF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...