Thursday, 9 January 2020

స్వీటీ సినిమా రిలీజ్‌పై అనుమానాలు.. `నిశ్శబ్దం` వస్తుందా.. రాదా..?

లేడీ ఓరియంటెడ్ సినిమాల నటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా నిశ్శబ్దం. వస్తాడు నా రాజు ఫేం హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క దివ్యాంగురాలిగా నటిస్తోంది. బహుభాష నటుడు మాధవన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండేలతో పాటు హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్సన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఇప్పటికే క్యారెక్టర్‌ పోస్టర్లతో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్ అయ్యింది. సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోవటంతో ఈ నెలాఖరున సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. Also Read: అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో నిశ్శబ్దం రిలీజ్ అయ్యే ఛాన్స్‌ లేదనిపిస్తోంది. టీజర్‌ రిలీజ్‌ తరువాత చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. అదే సమయంలో సినిమాలో అనుష్క లుక్‌ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క స్లిమ్‌గా చూపించేందుకు గ్రాఫిక్స్‌ను వాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే స్పెషల్ ఎఫెక్ట్స్‌ కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున ముందుగా అనుకున్నట్టుగా జనవరి 30 సినిమా రిలీజ్‌ చేయడం సాధ్యమయ్యే పని కాదన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించకపోయినా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం కనిపించకపోవటంతో సినిమా రిలీజ్‌ డేట్‌ మార్చే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QEjsUv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...