అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన పవర్ స్టార్ తరువాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. రాజకీయాల్లో బిజీ కావటంతో గతంలో అంగీకరించిన సినిమాలను కూడా పక్కన పెట్టేశాడు పవన్. దీంతో అభిమానులు పవన్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన కథానాయకుడిని వెండితెర మీద తిరిగి చూసుకునేందుకు వెయిట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత పవన్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిర్మాణంలో దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్తో పవన్ రీ ఎంట్రీ దాదాపుగా ఖాయమైంది. అయితే దిల్ రాజు పవన్ రీ ఎంట్రీ విషయంలో హింట్ ఇచ్చినా.. పవన్ మాత్రం ఇంత వరకు ఈ వార్తలపై స్పందించలేదు. అంతేకాదు రాజకీయాల్లో ఇంకా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. Also Read: ఇటీవల తమన్ తన ట్వీట్తో పవన్ రీ ఎంట్రీ సినిమా మీద క్లారిటీ ఇచ్చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్కు తమన్ సంగీతమందిస్తున్నట్టుగా దిల్ రాజు గతంలో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా అల వైకుంఠపురములో సక్సెస్ సందర్భంగా తనను అభినందించిన పవన్కు కృతజ్ఞతలు తెలుపుతూ మీతో సినిమా చేయటం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు తమన్. దీంతో పవన్, పింక్ రీమేక్లో నటిస్తున్నాడన్న విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంకా సెట్స్ మీదకు రాని ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా చర్చ జరుగుతోంది. వేసవి కానుకగా మే 23న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ గ్యాప్లో సినిమాను పూర్తి చేసి ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/388W2fU
v
No comments:
Post a Comment