Thursday, 16 January 2020

అయ్యో కీర్తి సురేష్.. బాలీవుడ్ ఆఫర్ పోయిందా?

‘మహానటి’తో జాతీయ అవార్డు అందుకుని పాపులర్ అయిపోయారు . ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అలనాటి నటి సావిత్రమ్మ బయోపిక్‌లో నటించే వరం దక్కింది. దానిని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టే ఈరోజు ఆమెను అంతా ‘సావిత్రమ్మ’గానే గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఆమెకు అవకాశాలు అన్ని ఇండస్ట్రీల నుంచి వచ్చి పడుతున్నాయి. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చిందంటే కీర్తికి ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో తొలిసినిమాలోనే అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మైదాన్’ అనే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే సినిమా రాబోతోంది. దాదాపుగా షూటింగ్ కూడా అయిపోయింది. అయితే ఈ సినిమా నుంచి కీర్తి తప్పుకున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం గురించి నిర్మాత బోనీ కపూర్‌తో కీర్తి చర్చించే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. కీర్తి చూడటానికి చాలా యంగ్‌గా కనిపిస్తున్నారట. ఎందుకంటే సినిమాలో కీర్తి అజయ్ భార్య పాత్రలో నటించాల్సి ఉంది. కానీ కీర్తి ఆయన పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నారట. READ ALSO: కనీసం వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్‌తోనూ ఆమె లుక్‌ను మార్చలేని పరిస్థితి. అదీకాకుండా ‘మహానటి’ సినిమాలో 27 ఏళ్ల కీర్తి 45 ఏళ్ల సావిత్రి పాత్రలో నటించారు. ఆ తర్వాతి సినిమాలో కూడా పెద్ద వయసున్న మహిళ పాత్రలో నటిస్తే కీర్తికి ఇలాంటి పాత్రలే వస్తాయని అనుకునే ప్రమాదం కూడా ఉందని బోనీ అభిప్రాయపడ్డారట. అందులోనూ కీర్తి నటిస్తున్న తొలి హిందీ సినిమా ఇదే. ఆరంభంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే మున్ముందు కెరీర్ దెబ్బతినే అవకాశం ఉందని కీర్తి, బోనీ చర్చించుకుని ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో కీర్తి, బోనీ, అజయ్ స్పందిస్తే కానీ ఓ క్లారిటీ వచ్చేలా లేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FYke8J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...