ద్రావిడ పితామహుడు తందై పెరియార్పై సూపర్స్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై తమిళనాడు రాష్ట్రం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఆయనపై పోలీసు కేసు కూడా పెట్టారు. రజినీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ రజినీ వీటికి అస్సలు భయపడలేదు. ఎవరెన్ని చేసినా తాను మాత్రం అస్సలు క్షమాపణ చెప్పనని అన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత సెల్లూ్ర్ రాజా.. రజినీ ఫ్యామిలీని ఈ వివాదంలోకి లాగారు. రజినీ రెండో కూతురు సౌందర్య గతేడాది సినీ నటుడు విశాఖన్ వనగమూడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సౌందర్యకు విశాఖన్కు ఇది రెండో పెళ్లి. దీని గురించి రాజా మాట్లాడుతూ.. ‘పెరియార్పై రజినీకాంత్ ఆ వ్యాఖ్యలు చేయడం అనవసరం. 50 ఏళ్ల క్రితం ఏదో మ్యాగజైన్లో పబ్లిష్ అయిన విషయం ఇఫ్పుడు లేవనెత్తాల్సిన అవసరం లేదు. పెరియార్ కుల, మతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎన్నో మంచి పనులు చేశారు. సమాజంలో వెంటాడుతున్న చెడును తరిమికొట్టారు. రజినీకాంత్ కూతురు సౌందర్య రెండో పెళ్లి ఎలా చేసుకోగలిగారు? పెరియార్ ఆలోచనా విధానాల వల్ల సమాజంలో వచ్చిన మార్పు వల్లే కదా. అలాంటప్పుడు రజినీ పెరియార్ను తక్కువ చేసి మాట్లాడి ఉండకూడదు’ అని తెలిపారు. READ ALSO: ద న్యూస్ మినిట్ కథనం మేరకు ఈ నెల 14న జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న రజనీ తందై పెరియార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీలో పెరియార్ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించినట్టుగా ద న్యూస్ మినిట్ పేర్కొంది. అంతేకాదు ఆ సమయంలో ఒక్క తమిళ మేగజైన్ మాత్రం ఈ వార్తను ప్రచురించిందని ప్రభుత్వం ఈ వార్త బయటకు రాకుండా జాగ్రత్త పడిందని రజనీ వ్యాఖ్యనించినట్టుగా వెల్లడించారు. READ AlSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TScqxl
v
No comments:
Post a Comment