ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీళ్లేదని డిమాండ్ చేస్తూ, మూడు రాజధానుల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అక్కడి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి రైతుల నిరసనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మద్దతు తెలుపుతోంది. వారి తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. వామపక్షాలు కూడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. అమరావతి పరిరక్షణ జేసీఏ ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం చేపట్టిన పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. అమరావతి రైతులకు తాను అండగా ఉంటానని ప్రకటించారు సినీ నటుడు, చంద్రబాబు నాయుడు తమ్ముడు కుమారుడు నారా రోహిత్. ఈ మేరకు గురువారం ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. రైతుల పోరాటం వృథా కాదని, త్వరలోనే వారి పోరాటంలో పాలు పంచుకుంటానని పేర్కొన్నారు. Also Read: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలు పంచుకుంటాను’’ అని తన ఫేస్బుక్ పోస్టులో రోహిత్ వెల్లడించారు. అంతకు ముందు ప్రముఖ తెలుగు పాప్ సింగర్, నటి స్మిత కూడా అమరావతి రైతుల నిరసనకు తన మద్దతు తెలిపారు. రైతుల పరిస్థితి చూస్తుంటే తన గుండె బద్ధలౌవుతోందని ట్వీట్ చేశారు. రైతులకు అండగా తానుంటానని స్పష్టం చేశారు. స్మిత కూడా టీడీపీ సానుభూతిపరురాలు అనే సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36CIadH
v
No comments:
Post a Comment