Thursday, 9 January 2020

తండ్రి ప్రూవ్ చేసేసుకున్నాడు.. ఇక వారసురాలొస్తోంది

స్టార్ హీరోల హవా అయిపోయింది.. ఇక వారి వారసులు పరిశ్రమలను ఏలేస్తున్నారు. అయితే తెలుగులో అగ్ర హీరోల కుమారులే ఉన్నారు కానీ.. వారసురాళ్లు ఒకరో ఇద్దరో ఉన్నారు. అయితే ఇప్పుడు మరో స్టార్ కిడ్ తెలుగులో అడుగుపెట్టబోతోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ నటుడు, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అర్జున్ కూతురు ఐశ్వర్య. 2013లో వచ్చిన ‘పట్టాత్తు యానాయ్’ అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఐశ్వర్య. ‘ప్రేమ బరాహ’ సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించారు. అలా ఇప్పటవరకు ఐశ్వర్య మూడు సినిమాల్లోనే నటించారు. అయితే 2018 నుంచి 2019 మధ్యలో ‘మీటూ’ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అర్జున్‌పై ఓ నటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దాంతో ఐశ్వర్య చాలా డిస్టర్బ్ అయ్యారు. ఏడాది పాటు ఎలాంటి సినిమాలకు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు అర్జున్ తన గారాలపట్టిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తన కూతురి తొలి తెలుగు సినిమాను తానే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఓ పేరున్న నిర్మాణ సంస్థతో కలిసి అర్జున్‌ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించాలని అనుకుంటున్నారు. READ ALSO: ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లను తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ తీసుకున్నా కూడా మల్టీస్టారర్‌ సినిమాల్లోనో లేకపోతే సెకండ్ హీరోయిన్‌గానో తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఐశ్వర్యకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో అవకాశం వచ్చే ఛాన్స్‌లు చాలా తక్కువ. అందుకే మొదటి సినిమాను తానే తీయాలని అర్జున్ నిర్ణయించుకున్నట్లున్నారు. ఒకవేళ సినిమా బాగా ఆడి ఐశ్వర్యకు మంచి పేరు వస్తే అవకాశాలు దానంతట అవే వస్తాయి. మరి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఐశ్వర్య ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sZP91D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...