భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. A+, A, B, C కేటగిరీల్లో మొత్తం 27 మంది భారత క్రికెటర్లకి సెంట్రల్ కాంట్రాక్ట్లో చోటిచ్చిన బీసీసీఐ.. ధోనీకి మాత్రం మొండిచేయి చూపింది. ఇలా సెంట్రల్ కాంట్రాక్ట్లో లేకపోవడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దాంతో ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై తాజాగా ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటివరకు బాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, నిర్మాతలపైనే వివాదాస్పద కామెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన చూపు క్రికెట్ రంగంవైపు మళ్లినట్లుంది. దాదాపు ఏడాదిన్నరగా ధోనీ రిటైర్మెంట్ హాట్ టాపిక్గా మారింది. అయితే రోజులు గడుస్తున్నాయే కానీ ధోనీ మాత్రం ఈ విషయం గురించి నోరు విప్పడంలేదు. దాంతో కమాల్ ఆర్ ఖాన్ నోరుపారేసుకున్నాడు. READ ALSO: ట్విటర్లో ధోనీ గురించి మాట్లాడుతూ... ‘గతంలో కొందరు క్రికెటర్లను విసిరేసినట్లుగానే నేడు బీసీసీఐ ధోనీని కూడా అవతలపారేసింది. ఇతర క్రీడాకారుల్లా కాకుండా ధోనీ గౌరవంగా రిటైర్ అవుతారని అనుకున్నాను. కానీ అనతు ఇతర క్రీడాకారుల్లాగే మెడపట్టి బయటికి గెంటితేనే పోతాం అన్న రూల్ని ఫాలో అయ్యాడు. ఇది చాలా బాధాకరం’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే కమాల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలపై ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు రివ్యూలు ఇచ్చుకునే కమాల్కి క్రికెటర్ల గురించి అందులోనూ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TA2oAY
v
No comments:
Post a Comment