Sunday, 19 January 2020

‘‘మహానటి’ చూసి ఎంత ఏడ్చానో, కీర్తి సురేష్‌కి ఫోన్ చేసి..’’

కీర్తి సురేష్ జీవితంలో ‘మహానటి’ ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాతో కీర్తికి జాతీయ అవార్డు వరించింది. కెరీర్ తొలినాళ్లలోనే సావిత్రమ్మ బయోపిక్‌లో నటించే అవకాశం దక్కించుకుని పుణ్యం చేసుకున్నారు కీర్తి. అయితే ఈ సినిమాను ఎన్ని సార్లు చూశానో కూడా గుర్తులేదని అంటున్నారు బాలీవుడ్ నటి . ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మహానటి సినిమాను ఎన్ని సార్లు చూశానో కూడా లెక్కలేదు. తొలిసారి సినిమా చూశాక ఏడుపు వచ్చేసింది. దాంతో వెంటనే కీర్తి సురేష్‌కు ఫోన్ చేసి ఏడ్చేశాను. ఎందుకు ఏడ్చానో తెలీదు కానీ సావిత్రి అంటే చాలా అభిమానం’ అని తెలిపారు. అంతేకాదు తనకు దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్‌ ఏ స్థాయిలో ఉందో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అదే స్థాయిలో ఉందని అన్నారు. ‘మహానటి’ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించారు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. READ ALSO: ఇక జాన్వి విషయానికొస్తే.. 2018లో ‘ధడక్’ సినిమాతో ఆడియన్స్‌ మనసులు దోచేసుకున్నారు. రెండో సినిమాగా భారీ ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు ‘దోస్తానా 2’, ‘తఖ్త్’, ‘రూహీ అఫ్జాహీ’ సినిమాలు కూడా ఉన్నాయి. 2020లో జాన్వి బిజీ బిజీగా ఉండబోతున్నారన్నమాట. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3654Lyk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...