Saturday, 18 January 2020

బాలీవుడ్‌ `అర్జున్‌ రెడ్డి` ఇంట విషాదం

విభిన్న చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న బాలీవుడ్‌ నటుడు షాహిద్ కపూర్‌ ఇంట విషాదం నెలకొంది. ఈ స్టార్ హీరో అమ్మమ్మ ఖాదిజా అజీమ్‌ మృతి చెందారు. కొంతకాలంగా వయోభారం రీత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఖాదిజా శనివారం కన్నుమూశారు. ఖాదిజా యంగ్‌ హీరో దడక్‌ ఫేం ఇషాన్ కట్టర్‌కు కూడా అమ్మమ్మ అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఇషాన్‌ భావోద్వేగంగా పోస్ట్‌ను పెట్టాడు. `అమ్మీ... మీరు మా అందదరికి తెలివి, జ్ఞానం, పట్టుదల లాంటివి నొప్పించారు. అంతేకాదు నువ్వు స్వాతంత్ర్య సమరయోధురాలివి, రచయితవి, అనువాదకురాలివి, సంపాదకురాలివి .. అంతకు మించి మంచి సోదరివి, భార్యవి, తల్లివి, అత్తవి, అమ్మమ్మవి, స్నేహితురాలివి, నమ్మకస్తురాలివి ఇంకా చాలా గొప్పదానివి నువ్వు. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నీలాంటి వ్యక్తి మా జీవితంలో ఉండటం మా అధృష్టం. మీరు జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఎవరైనా మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేరు.` అన్న కామెంట్‌తో పాటు కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశారు. సినిమాల విషయానికి వస్తే ఇటీవల కబీర్‌ సింగ్ (అర్జున్‌ రెడ్డి రీమేక్‌)తో సూపర్‌ హిట్ అందుకున్న ప్రస్తుతం మరో తెలుగు సూపర్‌ హిట్ జెర్సీ సినిమాను బాలీవుడ్‌లో అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇషాన్ కూడా ఓ తెలుగు సినిమా రీమేక్‌లోనే నటిస్తుండటం విశేషం. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఖాలీ పీలీ సినిమాలో నటిస్తున్నాడు ఇషాన్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30wjots
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...