Wednesday, 22 January 2020

`ప్రభాస్‌ 20`పై కొత్త న్యూస్‌.. ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్‌!

సాహో సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న యంగ్ రెబల్‌ స్టార్ కొత్త సినిమాను షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. సాహో సెట్స్‌ మీద ఉండగానే మొదలెట్టిన ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సాహో తరువాత ప్రభాస్‌ బ్రేక్‌ తీసుకొని విదేశాలకు వెళ్లిపోవటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు మూడు కోట్లతో నిర్మించిన సెట్‌లో ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటుల కాంబినేషన్‌లో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఇది ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా అన్న ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా ఈ సినిమా పీరియాడిక్‌ జానర్‌ కాదని ట్విస్ట్ ఇచ్చాడట దర్శకుడు రాధకృష్ణ. Also Read: తాజా సమాచరం ప్రకారం ఈ సినిమా రొమాంటిక్‌ డ్రామానే గానీ, పీరియాడిక్‌ స్టోరి కాదని తెలుస్తోంది. అదే సమయంలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గోపీ కృష్ణ మూవీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరుసగా బాహుబలి, సాహో సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌, నెక్ట్స్ సినిమాను కూడా అదే స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కొత్త సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోరూ పొందిస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాను 2021 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36iagtE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...