అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ఇటీవల సినిమాతో నిరాశపరిచాడు. తన నుంచి అభిమానులు ఆశించే కొత్తదనాన్ని పక్కనపెట్టి రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో సినిమా చేసిన నిరాశపరిచాడు. అందుకే నెక్ట్స్ సినిమాలో అభిమానులు తన నుంచి ఆశించే అంశాలతో రూపొందించే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ ఆర్ట్స్ ఎల్ఎల్పీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన హాసిత్ గోలి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. Also Read: ఎంటర్టైన్మెంట్తో పాటు డ్రామాతో ఈ చిత్ర కథలో వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు చిత్ర దర్శకుడు హాసిత్ గోలి. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. వివేక్ సాగర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు వేదరామన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OVnI16
v
No comments:
Post a Comment