Thursday, 12 December 2019

వి మిస్ యు టుడే నాన్న.. వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్

తన కొడుకు, మనవళ్లతో ఒక సినిమా తీయాలన్నది దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు కల. ఈ విషయాన్ని ఆయన కుమారులైన డి.సురేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ఇప్పటికే వెల్లడించారు. వెంకటేష్, రానా, నాగ చైతన్యలతో కలిసి నాన్నగారు ఒక సినిమా చేయాలనుకునేవారని ఇటీవల ‘వెంకీమామ’ చిత్ర ప్రచారంలో భాగంగా సురేష్ బాబు అన్నారు. కానీ, ఆ కల తీరకుండానే రామానాయుడు స్వర్గస్థులయ్యారు. అందుకే, ఇప్పుడు ‘వెంకీమామ’ సినిమాను ఆయనకు అంకితమిస్తున్నారు. ‘వెంకీమామ’ విడుదల సందర్భంగా తన తండ్రి రామానాయుడును గుర్తుచేసుకుంటూ వెంకటేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఇలాంటి రోజున మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం నాన్న! ‘వెంకీమామ’ ఇప్పుడు మీ అందరిదీ. దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి’’ అని వెంకీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ పోస్టులో చైతన్యతో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను, ప్రస్తుత ‘వెంకీమామ’ సినిమాలో ఇద్దరి స్టిల్‌ను వెంకటేష్ పొందుపరిచారు. కాగా, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నేడు (డిసెంబర్ 13న) ‘వెంకీమామ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అక్కడి నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ మరోసారి తన నటనతో అబ్బురపరిచారట. ఫస్టాఫ్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయట. నాగచైతన్య సైతం ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారని అంటున్నారు. సెకండాఫ్‌లో నాగచైతన్య నటన చాలా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద మామా అల్లుళ్లు కలిసి తెలుగు ప్రేక్షకులకు మంచి హిట్ ఇచ్చారని టాక్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YKZ6M0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...