ప్రముఖ రచయిత, సీనియర్ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్లో విషాదం అలుముకుంది. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖులు, రచయితలు గొల్లపూడి మృతి పట్ల ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు కాస్త ఆలస్యంగా జరగనున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కొంత మంది విదేశాల్లో ఉండటంతో వాళ్లు వచ్చేంత వరకు ఆగాల్సి వస్తోంది. వాళ్లంతా వచ్చిన తరవాత ఆదివారం మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన రెండో కుమారుడు రామకృష్ణ మీడియాకు తెలిపారు. శనివారం మధ్యాహ్నం తన తండ్రి భౌతికకాయాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పారు. అభిమానుల సందర్శనార్థం తమ నివాసంలో భౌతికకాయాన్ని పెడతామని వెల్లడించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు జరుపుతామని చెప్పారు. Also Read: ఇదిలా ఉంటే, గొల్లపూడికి ముగ్గురు కుమారుల సంతానం. పెద్ద కుమారుడు సుబ్బారావు కుటుంబం విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రెండో కుమారుడు రామకృష్ణ కుటుంబం చెన్నైలోనే ఉంటుంది. ఆయన వద్దే మారుతీరావు ఉంటున్నారు. ఇక మూడో కుమారుడు శ్రీనివాస్ 1992 ఆగస్టు 12న మరణించారు. తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో విశాఖ తీరంలో సముద్ర అలలకు బలైపోయారు. తన కుమారుని జ్ఞాపకంగా, గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు మారుతీరావు నెలకొల్పారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Eewpxi
v
No comments:
Post a Comment