ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీకి ప్రధాని నరేంద్రమోదీ అంటే అస్సలు పడదు. ఆయన్ను, బీజేపీని ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. తాజాగా ‘సరైనోడు’ సింగర్ అయిన విశాల్ సోషల్ మీడియాలో మోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల మోదీ సూరత్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నా పాలనలో రేపిస్ట్లను మూడు, ఏడు, పదకొండు, నెల రోజుల వ్యవధిలోనే ఉరి తీయిస్తున్నాను’ అన్నారు. దీనిపై విశాల్ స్పందిస్తూ.. అవన్నీ అబద్ధాలేనంటూ ఏకిపారేశారు. ‘అన్నీ అబద్ధాలే. మీ హయాంలో ఉరితీయబడిన ఒక్కరి పేరు చెప్పండి సర్. నిర్భయ రేపిస్ట్లు, ఆసిఫా రేపిస్ట్లు, ఉన్నావ్ బాధితురాలి రేపిస్ట్ అయిన బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ ఇప్పటికీ బతికే ఉన్నారు. మోదీజీ.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని మాకు తెలుసు. కానీ భారతీయ మహిళల బాధను మీరు ప్రచారంగా మార్చుకోవద్దు. ఉల్లిధరలు, ఎన్కౌంటర్లు, రేప్లు, హత్యలు పౌరసత్వ బిల్లును అమోదించడాన్ని ఆపడానికి ముందుగా రచిస్తున్న పథకాలుగా అనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరిచి అందరినీ ప్రశ్నించండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మొఘల్గా పేరు తెచ్చుకున్న విశాల్.. మోదీ వ్యాఖ్యలతో, ఐడియాలతో ఎప్పుడూ ఏకీభవించలేదు. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో మోదీని ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోని పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు .
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36fDCJy
v
No comments:
Post a Comment