రాజకీయాలతో బిజీ అయిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను మళ్లీ వెండితెరపై చూడాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. బహుశా వారి కోరికే పవన్ను కదిలించినట్టుంది. అందుకే, మళ్లీ సినిమాల వైపు చూడనన్న పవర్ స్టార్ మనసు మార్చుకుని రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి పింక్ రీమేక్ కాగా.. మరొకటి రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్లో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి కొత్తగా చెప్పేది ఏమీలేదు. అక్కడ అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రకు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తారు. తమిళ రీమేక్లో అజిత్ ఇదే చేశారు. కాకపోతే, తమిళం మాదిరిగానే పవన్ హీరోయిజం చూపించడానికి కొన్ని యాక్షన్ సీన్స్ చొప్పించే అవకాశం ఉంది. అయితే, క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా గురించి, ఆయన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. Also Read: ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించనున్నారని సమాచారం. ఇదొక పీరియాడిక్ డ్రామా అని అంటున్నారు. మొఘలాయిల కాలానికి సంబంధించిన కథట. మహమ్మదీయుల పరిపాలనా కాలం, అప్పటి పరిస్థితులను తెరపై చూపించబోతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే క్రిష్ పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులకి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందట. కాస్ట్యూమ్స్, సెట్స్, అప్పటి ఆయుధాలు ఇలాంటి వన్నీ సిద్ధం చేసుకోవాలంటే సమయం అవసరం కదా అని అంటున్నారు. నిజానికి పీరియాడిక్ సినిమా క్రిష్కి కొత్తేమీ కాదు. గతంలో నందమూరి బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను క్రిష్ తెరకెక్కించారు. అయితే, ఆ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అంత బాగా లేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి విమర్శలు రాకుండా పక్కా ప్రణాళికతో భారీ చిత్రంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట క్రిష్. ఈ సినిమాకు దొంగ అనే అర్థం వచ్చేలా టైటిల్ వేటలో కూడా ఉన్నారట క్రిష్. ఈ సినిమా మొదలుకావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ‘పింక్’ రీమేక్ మొదలయ్యే అవకాశం ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PPw3DR
v
No comments:
Post a Comment