సెన్సేషనల్ స్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఈ యంగ్ హీరో తాజాగా ఓ వివాదాస్పద బయోగ్రాఫికల్ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్ బయోపిక్ తలైవి. రాజకీయ జీవితమంత వివాదాలమయే. ఆమె రాజకీయ అరంగేట్రం, సీఎం పదవి చేపట్టడం, తరువాతి పరిణామాలు, శశికళాతో ఆమె సాన్నిహిత్యం లాంటి ఎన్నో వివాదాస్పద అంశాలు ఆమె జీవితంలో ఉన్నాయి. ముఖ్యంగా జయ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. అందుకే ఆమె కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారంటే ఎన్ని వివాదాలు తెరమీదకు రానున్నాయో అంటున్నారు సినీ జనాలు. Also Read: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, సినీ నటి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రల కనిపించనున్నాడట. జయలలిత జీవితంలో తెలుగు హీరో శోభన్బాబుది కీలక పాత్ర. ఒకప్పుడు వీరిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేంది. అంతేకాదు వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా అప్పట్లో చాలా గట్టిగానే జరిగింది. అయితే తరువాత కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు దూరమయ్యారు. ఇప్పుడు జయలలిత బయోపిక్లో విజయ్ దేవరకొండ శోభన్బాబు పాత్రలో నటిస్తున్నాడు. Also Read: అయితే ఈసినిమాలో వీరిద్దరి రిలేషన్కు సంబంధించి పెద్దగా కాంట్రవర్సీలకు పోయే అవకాశం లేదు. అందుకే విజయ్ కూడా ఈ పాత్రకు ఓకె చెప్పి ఉంటాడని తెలుస్తోంది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్న ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిథి పాత్రలో ప్రకాష్ రాజ్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత లుక్లో కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కంగనా బరువు పెరిగి మరీ అమ్మ పాత్రకు రెడీ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ONsIEX
v
No comments:
Post a Comment