సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. తొలిరోజు ‘ప్రతిరోజూ పండగే’ కలెక్షన్స్ ఓ మాదిరిగానే ఉన్నప్పటికీ రెండో రోజు శనివారం నుంచి పుంజుకున్నాయి. మూడో రోజు ఆదివారం అయితే తొలిరోజు కన్నా అధికంగానే కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.23.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సీజన్లో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ప్రతిరోజూ పండగే’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రావు రమేష్ కామెడీకి ప్రేక్షకులు పడిపడి నవ్వుతున్నారు. కాగా, ఈ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన రూ.23.25 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.10.60 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ను రూ.18 కోట్లకు విక్రయించారు. అంటే, ప్రస్తుతానికి 60 శాతం రికవర్ అయిపోయింది. ఇదే ఊపు ఈవారం కూడా కొనసాగితే ‘ప్రతిరోజూ పండగే’ లాభాల బాట పట్టేస్తుంది. ఇదిలా ఉంటే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచే అధిక వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల డిస్ట్రిబ్యూటర్ షేర్ సుమారు రూ.9 కోట్లుగా ఉంది. తొలిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ.2.9 కోట్ల షేర్ వసూలుచేసిన ‘ప్రతిరోజూ పండగే’.. మూడో రోజు బాగా పుంజుకుంది. రూ.3.2 కోట్లు రాబట్టింది. మొత్తం మీద మూడు రోజుల్లో రూ.9.06 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా మూడు రోజుల షేర్ నైజాం - రూ. 3.8 కోట్లు సీడెడ్ - రూ. 1.10 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 1.33 కోట్లు గుంటూరు - రూ. 66 లక్షలు తూర్పుగోదావరి - రూ. 68 లక్షలు పశ్చిమ గోదావరి - రూ. 52 లక్షలు కృష్ణా - రూ. 63 లక్షలు నెల్లూరు - రూ. 34 లక్షలు మొత్తం షేర్ - రూ. 9.06 కోట్లు
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sXd6pO
v
No comments:
Post a Comment