మహర్షి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ ప్రస్తుతం దర్శకత్వంలో `సరిలేరు నీకెవ్వరు` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మహేష్ సరసన రష్మిర మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకోవటంతో మహేష్ తదుపరి చిత్రాలపై చర్చ మొదలైంది. మహేష్ నెక్ట్స్ సినిమా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే మహేష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో గీత గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. Also Read: మరోవైపు మహేష్కు మహర్షి లాంటి మెమరబుల్ సినిమాను అందించిన వంశీ పైడిపల్లి కూడా మహేష్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్స్ లో మహేష్ ఏ సినిమాను ముందుగా పట్టాలెక్కిస్తాడో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో దర్శకుడికి కూడా మహేష్ మరో ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. Also Read: అయితే ఈ సినిమా ఇప్పటికిప్పుడే ప్రారంభమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత అనిల్ షార్ట్ బ్రేక్ తీసుకోనున్నాడు. ఆ తరువాతే మరో సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోగా మహేష్ మరో సినిమాను పూర్తి చేస్తాడు. మరి మహేష్ ఆఫర్ను అనిల్ అందుకుంటాడా..? మరో ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్తో సూపర్ స్టార్ను మెప్పిస్తాడా..? అన్న విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32itkWL
v
No comments:
Post a Comment