చిలీకి చెందిన ప్రముఖ గాయని చేసిన పని అందరినీ షాక్కు గురిచేస్తోంది. తన దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలని తనదైన శైలిలో నిరసన చేసింది. ప్రస్తుతం ఆ దేశం ఉన్న పరిస్థితిని వివరిస్తూ లఫర్తే ‘చిలీ యువర్ పెయిన్ హర్ట్స్ మీ’ అనే పాట రాసింది. ఈ పాట చిలీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ సందర్భంగా ఆమెను ఓ అవార్డ్ వేడుకకు పిలిచి అవార్డుతో సత్కరించారు కూడా. అయితే వేడుకకు ఒంటినిండా దుస్తులు వేసుకుని ఎక్కడా ఇసుమంతైనా ఎక్స్పోజింగ్ లేకుండా లఫర్తే రావడం చూసి చాలా మంది ఆశ్యర్చపోయారు. అదే వేడుకలో లఫర్తే ర్యాంప్ వాక్ చేస్తూ ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేశారు. ర్యాంప్ వాక్ చేస్తూ తన జాకెట్ విప్పేసి వక్షోజాలను చూపించారు. వాటిపై ‘చిలీలో టార్చర్ పెట్టి రేప్ చేసి చంపేస్తారు’ అని స్కెచ్ పెన్తో రాసుకుని వచ్చారు. దాదాపు నెల రోజులుగా చిలీలో ఆర్థిక అసమానత్వం, రాజకీయ సంక్షోభం సమస్యలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లలో భాగంగా దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లకు పాల్పడిన వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని టార్చర్ పెట్టి రేప్ చేసి చంపేశారట. అల్లర్లను ఆపేందుకు పోలీసులు పెల్లెట్ గన్స్తో కాల్చడంతో దాదాపు వందలాది అంధులైపోయారు. వేలాది మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని విడుదల చేసేశారు. లాఫర్తే మాత్రమే కాదు దేశానికి చెందిన ఎందరో సెలబ్రిటీలు ఈ ఘర్షణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్వే ఛార్జీలను పెంచాలని మొదలైన ఆందోళనలు రోడ్లు శుభ్రం చేసినందుకు కూడా డబ్బులు పెంచాలన్న డిమాండ్కు దారితీసింది. అక్కడి నుంచి ఆర్థిక, రాజకీయ సమస్యలకు దారితీసింది. అల్లర్లు ముదురుతున్న నేపథ్యంలో 2020లో రెఫరెండమ్ ఏర్పాటుచేసి డిమాండ్లను పరిష్కరిస్తాం అని అక్కడి ప్రభుత్వం తెలపడంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3337siA
v
No comments:
Post a Comment