Tuesday, 5 November 2019

గోపీచంద్ కష్టాలు.. రెమ్యునరేషన్ తీసుకోకుండానే సినిమా!

మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం బాగా వెనకబడిపోయారు. ఐదేళ్లుగా ఒక్క హిట్టు కూడా లేదు. ‘జిల్’ మొదలుకొని ఈ మధ్య వచ్చిన ‘చాణక్య’ వరకు ఏ ఒక్క సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో గోపీచంద్ మార్కెట్ బాగా పడిపోయింది. అయినప్పటికీ గోపీచంద్‌కు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఆయన ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘చాణక్య’ కమర్షియల్‌గా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. అయితే, ప్రస్తుతం గోపీచంద్ క్రేజ్‌, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్‌ను తగ్గించుకోవాలని నిర్మాత భావిస్తున్నారట. ఇదే విషయాన్ని దర్శకుడు సంపత్ నందికి కూడా నిర్మాత చెప్పారని టాక్. Also Read: ఈ విషయం గోపీచంద్ వరకు వెళ్లడంతో నిర్మాతకు ఎలాంటి నష్టం రాకుండా ఉండాలంటే తాను రెమ్యునరేషన్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యారని సమాచారం. ఇదే విషయాన్ని ఆయన నిర్మాతకు కూడా చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ప్రస్తుతానికి గోపీచంద్ రెమ్యునరేషన్ తీసుకోకపోయినా.. రేపు సినిమా విడుదలైన తరవాత వచ్చే లాభాల్లో షేర్ తీసుకోనున్నట్టు సమాచారం. ఈ విషయంలో గోపీచంద్, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు తెలిసింది. కాగా, ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qnCzHN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...