Tuesday, 5 November 2019

‘పింక్’ రీమేక్.. రూ.40 కోట్లు డిమాండ్ చేస్తోన్న పవర్ స్టార్!!

అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇంకా, అధికారికంగా ప్రకటించకపోయినా ఇటీవల బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘పవన్ కళ్యాణ్ ఒప్పించాను’’ అని అయితే అన్నారు. దీంతో మళ్లీ పవర్ స్టార్ వెండితెరపై కనిపించడం ఖాయమనే ప్రచారం అయితే జోరందుకుంది. ఇంతకీ, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నిజంగా నటిస్తున్నారా? లేదా? అనే విషయం ఖరారు కాకముందే మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘పింక్’ తెలుగు రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారట. అంతేకాదు, లాభాల్లో తనకు 25 శాతం వాటా కూడా ఇవ్వాలని షరతు పెట్టారట. దీనిపై నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజు ఇంకా తమ నిర్ణయాన్ని వెల్లడించలేదని టాక్. వాస్తవానికి ‘అజ్ఞాతవాసి’ సినిమాకు పవన్ కళ్యాణ్ సుమారు రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఆ తరవాత ఆయన రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఆయన ఒక సినిమా ఒప్పుకుంటే మరీ రూ.40 కోట్లు డిమాండ్ చేస్తారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. Also Read: కాగా, ‘పింక్’ సినిమాను ఇప్పటికే తమిళంలో ‘నేర్కొండ పార్వాయి’గా బోనీ కపూర్ రీమేక్ చేశారు. అజిత్ హీరోగా నటించారు. ఇప్పుడు తెలుగులో దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ రీమేక్ చేయబోతున్నారు. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కూడా పనిచేస్తున్నట్టు టాక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడంతో పాటు మాటలు కూడా త్రివిక్రమ్ రాస్తు్న్నారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్ కూడా వేసినట్టు తెలిసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rg86vN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...