Friday, 4 October 2019

Sri Reddy: వాళ్లంతా ఉపాసన పాదం మీద దుమ్ము.. మెగా ఫ్యామిలీపై పడిందేంటి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అల్లుపై వివాదాస్పద నటి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన ప్రచారం కోసం, నలుగురి నోళ్లలో తన పేరు రోజూ నానడం కోసం ఇష్టమొచ్చినట్టు ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తూ, ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీలను టార్గెట్ చేసే శ్రీరెడ్డి.. ఇప్పుడు మెగా ఫ్యామిలీపై పడింది. ఉపాసన ఉన్నతమైన మహిళని పొగుడుతూనే స్నేహారెడ్డిని తీసిపారేసింది. ఉపాసనకు స్నేహారెడ్డికి చాలా తేడా ఉందని పేర్కొంది. ఉపాసన ఉన్నతమైన మహిళ అని, మిగిలినవారంతా ఆమె పాదంపై దుమ్ముతో సమానమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో తాజాగా ఒక పోస్టు పెట్టింది. ఉపాసనపై గతంలోనూ పలుమార్లు శ్రీరెడ్డి ప్రశంసల వర్షం కురిపించింది. సేవా కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్లను ఉపాసన ఆదుకుంటున్నారని గతంలో శ్రీరెడ్డి కొనియాడింది. ఇప్పుడు అదే ప్రస్తావనను తీసుకొచ్చి స్నేహారెడ్డిని తక్కువ చేస్తూ వివాదాస్పద చర్చకు తెరలేపింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలను కొంత మంది ఫేస్‌బుక్‌లో వ్యతిరేకించారు. దీనికి కూడా శ్రీరెడ్డి సమాధానం ఇచ్చింది. ‘‘భయంకరమైన వ్యాధులతో పోరాడుతోన్న ఎంతో మంది పేద పిల్లలకు ఉపాసన సాయం చేస్తున్నారు. ఆమె చాలా మందికి సహాయం అందిస్తున్నారు. ఆమె ఎంతో మందికి రోల్ మోడల్, దేశం గర్వించదగిన మహిళ. స్నేహా తన రిచ్ కిడ్స్‌ను మాత్రమే చూసుకుంటున్నారు’’ అని శ్రీరెడ్డి వివరణ ఇచ్చింది. మొత్తానికి ఫేస్‌బుక్‌లో చిన్న కామెంట్‌తో పెద్ద చర్చనే లేవదీసింది శ్రీరెడ్డి. గమనిక: ఇది శ్రీరెడ్డి చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ఆధారంగా రాసిన కథనం మాత్రమే. ఒకరిని అవమానించాలనో, వారి పరువుకు భంగం కలిగించాలనో మా ఉద్దేశం కాదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/352dIt7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...