Monday, 23 September 2019

‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటోన్న సాయి ధరమ్ తేజ్

‘చిత్రలహరి’తో ఫామ్‌లోకి వచ్చిన సుప్రీం హీరో ఇప్పుడు వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తు్న్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే, సుబ్బు అనే కొత్త దర్శకుడితో పనిచేయడానికి సాయి ధరమ్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభంకావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం పరిశ్రమలో చక్కెర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ను పరిశీలిస్తున్నారట. ఈ భామ ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించింది. ఆమెతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. Also Read: కాగా, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతోన్న సుబ్బు.. దీన్ని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కొత్త అవతారంలో కనిపించనున్నారట. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలు తేజూ చేతిలో ఉన్నాయి. దర్శకులు దేవాకట్ట, మేర్లపాక గాంధీలతో సాయి ధరమ్ జతకట్టనున్నారు. వీటిని సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30h7BBl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...